మాజీ చైర్మన్ చుండ్రు ప్రకాష్…
అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట 19వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చంద్రబాబు చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంగరాల రాంబాబు, పట్టణ టిడిపి అధ్యక్షులు మచ్చ నాగు, కౌన్సిలర్ లు కాసిన కాశీ విశ్వనాథ్, కొవ్వాడ అప్పన బాబు,19వ వార్డ్ ప్రెసిడెంట్ నూనే వీర్రాజు చౌదరి, వల్లూరి వీర రాఘవ చౌదరి, వెంకట్రావు చౌదరి, రెడ్డి పుల్లాజీ చౌదరి, చెన్నం రాంబాబు, ఆకుల సత్యనారాయణ, ఈలి తాతాజీ, శెట్టి రవికుమార్, మనోజ్ కృష్ణ,పుచ్చకాయల సత్యనారాయణ,క్లస్టర్ ఇంచార్జ్ బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.