ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు….
ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు….
ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలన్నారు.