ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం అమలాపురం టౌన్ కి కూతవేటు దూరం లో ఉన్న జనుపల్లి గ్రామంలో ఈ ప్రమాదకర విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది వివరాల్లోకెలితే డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో అమ్మవారి గుడికి ఆనుకుని ఉన్న మెట్ల సత్యనారాయణ కాలనీ లో ప్రమాదకరంగా మారిన ఈ విద్యుత్ స్తంభం గురించి అధికారులకు అనేక మార్లు పిర్యాదు చేయగా కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసినప్పటికీ పాత విద్యుత్ స్తంభం నుండి కొత్త విద్యుత్ స్తంభానికి వైర్లు కనెక్షన్స్ ఇవ్వకపోవడం పట్ల ప్రమాదకరమైన విద్యుస్తంభం ఎప్పుడు పడిపోతుందో ఎవరిమీద పడిపోతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న వైనం ఈ ప్రమాదకరమైన విద్యుత్ స్తంభం వలన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగితేనే అధికారులు పట్టించుకుంటారా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్య పట్ల స్పందించి కొత్త విద్యుత్ స్తంభానికి వైర్లు కనెక్షన్స్ ఇచ్చి పాత విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని స్తానిక నివాసులు కోరుతున్నారు సంబంధిత అధికారులు సమస్య పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి