ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి – డి పి టి ఓ వై వి ఎస్ ఎన్ మూర్తి
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఆర్టిసి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని డి పి టి ఓ వై వి ఎస్ ఎన్ మూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్ర రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సందర్భంగా బుధవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు కండక్టర్లకు డ్రైవర్లకు ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టి పి టి ఓ వై వి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రతి బస్ స్టేషన్ను పారిశుద్ధ్య నిర్వహణ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేశామని ఇప్పటివరకు సుమారుగా 50వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్నారని స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అమలులో సుమారు 70000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవడం జరుగుతుందని ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఆంధ్రప్రదేశ్ నివాసిగా గుర్తింపు ఉండేందుకు ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ తగిన గుర్తింపు కార్డును తీసుకువచ్చి ఉచిత బస్సు ప్రయాణం టిక్కెట్టును పొందాలన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అవసరతలను గుర్తించి తగిన బస్సులను అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వుర్ ఆర్ టి సి డిపో మేనేజర్ ధనుంజయ్ గ్యారేజ్ ఏ ఎంఎఫ్ సునైనా ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు