మండపేట శ్రీ గణేష్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. యూనియన్ అధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బుంగ సంజయ్ ను సభ్యులు ఎన్నుకోగా గౌరవాధ్యక్షులుగా మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ను ఎన్నుకున్నారు. అలాగే యూనియన్ గౌరవ సలహాదారులుగా సన్మాల వెంకన్న, టేకుమూడి శ్రీనివాసరావు, ముఖ్య సలహాదారులుగా బొచ్చ ప్రసాద్, ఏలేటి శ్యామసుందర్ బాబు, ఉపాధ్యక్షులుగా మోరంపూడి విజయ్ కుమార్, కార్యదర్శిగా చిర్ర బాపిరాజు, సంయుక్త కార్యదర్శిగా జంగం విజయ్, కోశాధికారి సబ్బవరపు దుర్గాప్రసాద్, సభ్యులుగా దుంపల రమేష్, టేకి రాంబాబు, కమిలి చిన్నబ్బాయి, పల్లేటి నాగన్న, అంగర శ్రీను, నీల సూర్య చంద్ర లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.