Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

రైతులు తప్పనిసరిగా పంటను నమోదు చేయించాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం లో గల రైతుసేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ సహాయకులకు పలు సూచనలు చేసారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రంలో నమోదు చేసేందుకు ప్రభుత్వం వారు మరో అవకాశం కల్పించారని, ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సొంత భూమిలేని కౌలు రైతులకు కనీసం ఒక ఎకరం సాగుదారు పత్రం పొందాలని, పంట నమోదు చేసుకున్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వరిస్తుందని అన్నారు. ప్రతి గ్రామం లోనూ రైతులు పంట నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా ఆగస్టు 15 పంట భీమా కోసం రైతు వాటా చెల్లించేందుకు చివరి తేది అని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు గురించి సర్వే నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ సమావేశంలో తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo