కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించిన కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత
కొవ్వూరు డివిజన్ పరిధిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు – ఆర్డీవో రాణి సుస్మిత
తూర్పుగోదావరి జిల్లా లో రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. మంగళవారం, బుధవారం, గురువారం మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్న నేపథ్యంలో మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను ఆర్డిఓ రాణి సుస్మిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ 3 రోజులు పాటు భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నదిలో ఎవరు స్నానానికి దిగరాదని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికే ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు రిలీఫ్ క్యాంపులకు చేరుకోవాలని కోరారు. రిలీఫ్ క్యాంపు లలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో డి దుర్గాప్రసాద్ , మున్సిపల్ సానిటరీ మేస్త్రి రాజన్న అప్పారావు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.