డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోని సోమేశ్వరం, మాచవరం, పసలపూడి, చెల్లూరు, వెంటూరు, రాయవరం తదితర గ్రామాలకు జూలై 11వ తేదీ శుక్రవారం ఉదయం 09:00 గం! నుండి మధ్యాహ్నం 01:00 గం!ల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని, రామచంద్రపురం ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు,చెట్లుకొమ్మలు తొలగించడం,సోమేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలో 11 kv మాచవరం ఫీడర్, పసలపూడి సబ్ స్టేషన్ పరిధిలో పసలపూడి టౌన్ ఫీడర్, వెంటూరు సబ్ స్టేషన్ పరిధిలో, వెంటూరు ఇండస్ట్రియల్ ఫీడర్ మరమ్మత్తులు,మెయింటనెన్స్ నిమిత్తం.విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

