రాయవరం మండలంలో జూలై 4 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రాయవరం, సోమేశ్వరం సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు,11కెవి టౌన్ 1,2 ఫీడర్లు మెయింటినెన్స్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాచవరం, సోమేశ్వరం,రాయవరం,లొల్ల గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.