రాయవరం మండలంలోని పలు గ్రామాలకు ఆగష్టు 22 వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకువిద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. రాయవరం, పసలపూడి సబ్ స్టేషన్ల పరిథిలో పసలపూడి రూరల్ ఫీడర్ మరమ్మత్తులు కారణంగా పసలపూడి గ్రామ రైతులకు, వెదురుపాక ఫీడర్ పరిధిలో లైన్ల మరమ్మత్తుల నిమిత్తం వెదురుపాక, వి.సావరం, రాయవరం గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

