రామచంద్రపురం గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి
గొల్లపాలెంలో విద్యార్థుల భారీ ప్రదర్శన
సంఘీభావం తెలిపిన నాయకులు
రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో కాజులూరు జంక్షన్ నుండి మార్కెట్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ జెఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల కరెస్పాండంట్ చెల్లుబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, స్థానిక సర్పంచ్ పోతురాజు ప్రసన్నమౌనిక, బాబురావు, సొసైటీ అద్యక్షులు తోట కృష్ణ, బీజేపీ నాయకులు పోతుల వీరబాబు తదితర నాయకులు ర్యాలీకి మద్దతు పలికారు. ఇప్పటికే కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చిన సందర్భంలో త్వరలోనే రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ కాజులూరు మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు. వడ్డే చిన్న వీరబాబు, పెట్టా కృష్ణ మూర్తి, అంగర శ్రీను గౌడ్, మైనార్టీ నాయకులు ఎంఆర్ షాజహాన్ పీడీఎస్ యూ నాయకులు వానపల్లి నాగరాజు, కరుపోతు నవీన్ , బల్ల ఈశ్వరరావు, మాధురి స్వీట్ స్టాల్ దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.