రోడ్ ప్రమాదం. ముగ్గురుకి గాయాలు
రామచంద్రపురం-కాకినాడ ప్రధాన రహదారిలో కభేలా సమీపంలో బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కి సమాచారం అందించగా, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు ఉలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.