Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

శ్రీరాంనగర్ కాలనీలో ‘ సుపరిపాలనలో తొలిఅడుగు ‘ కార్యక్రమం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పురుషోత్తపట్నం ~ శ్రీరాంనగర్ కాలనీలో ‘ సుపరిపాలనలో తొలిఅడుగు ‘ కార్యక్రమం…!

తెలుగు యువత నాయకులు , ఎటపాక మత్స్య శాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి ఆధ్వర్యంలో

విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఎటపాక తెలుగు యువత నాయకులు , మత్స్యశాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి పేర్కొన్నారు. పురుషోత్తపట్నం పంచాయతీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పంతాడి అంజి మాట్లాడుతూ అవిశ్రాంత కార్మికుడు , విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న చేసిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు 15000 చొప్పున తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారని తద్వారా ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వులు చూశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గార్లపాటి శ్రీనివాస్ , దొడ్డపనేని లక్ష్మీనారాయణ , చేకూరి సత్యనారాయణ , శ్రీరాములు , కృష్ణంరాజు , పొదిలి నగేష్ , తదితరులు పాల్గొన్నారు.

https://viswamvoice.com/index.php?gf-download=2025%2F07%2FIMG-20250714-WA0071.jpg&form-id=5&field-id=1&hash=3e7fb6d4459f3be862c72862850a6389ea212f6483ad2e61c308617e4e641cf6

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo