రాయవరం మండలంలోని రాయవరం,వెదురుపాక, వెదురు పాక సావరం, గ్రామాలకు అక్టోబర్ 04 శనివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం వారం ప్రకటన ద్వారా తెలిపారు. రాయవరం సబ్ స్టేషన్, వెదురుపాక 11 కెవి ఫీడర్ పరిధిలో లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.