డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీసు స్టేషన్ ను ట్రైనీ అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి బుధవారం మండపేట రూరల్ సీఐ పి.దొర రాజు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పలు కేసుల వివరాలు ఎస్సై సురేష్ బాబు ను అడిగి తెలుసుకున్నారు, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సీజ్ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించి, ప్రజల రక్షణ కొరకు మండలంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల వివరాలను తెలుసుకున్నారు. అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి రాకను గమనించి, రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన పోలీస్ స్టేషన్ కు చేరుకుని, మర్యాదపూర్వకంగా డిఎస్పీ ని కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు, ఎస్సై డి సురేష్ బాబు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.