Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

సబార్డినెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తోటకు అభినందన వెల్లువ…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కార్యకర్తలతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల మండపేట వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల అభినందనలతో ముంచెత్తారు. శాసనసభ కమిటీలలో అత్యంత కీలకమైన సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఆయన నియామకం జిల్లా ప్రజలకు ఆనందదాయకమని కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయనకు కీలక బాధ్యతల అప్పగించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తపరిచారు. సాలువాలతో పూలమాలలతో ఆయన్ని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వైసిపి పార్టీ కార్యాలయంలోకి ఆదివారం తోట రాగానే రంగు రంగు పుష్పాలు పూల రేఖలతో తనదైన శైలిలో అంజూరు (పూల) శ్రీను పూల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు రాష్ట్రంలో కీలక పదవి వరించడం పట్ల పార్టీ వర్గాలలో నూతన ఉత్తేజం నింపింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెండు బాపిరాజు, మారిశెట్టి సత్యనారాయణ, యర్రగుంట అయ్యప్ప, పట్టణ మాజీ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు, జిల్లా ఫుడ్ కమిటీ మాజీ సభ్యులు పేపర్తి సాంబు, సూరంపూడి సత్యప్రసాద్, జిన్నూరు సత్యసాయిబాబా, పెంకే గంగాధరం, ఐ టి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, ప్రగడ సూరిబాబు, గంగుమల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo