29 November 2025
Saturday, November 29, 2025

సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి…

విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం

గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామములో గురువారం ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆదర్శ ఫార్మసీ కాళాశాలలో పి హెచ్ సి వైద్యాధికారణి నిఖిత మాట్లాడుతూ సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీబీ అంతానికి అందరూ భాగస్వామ్యం అవుదామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్టీఎస్ శ్రీనివాస్, సి హెచ్ ఓ శ్రావ్య లు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు నిక్షయ్ మిత్ర గా చేరి టిబి వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని పోషకాహారం అందించి చేయూత అందించాలని కోరారు. దగ్గు, ఇతర టిబి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికీ అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోనేవిధంగావిద్యార్థులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో 108 మందిని పరీక్షించి వారిలో 31 మంది నుంచి కళ్ళే పరీక్షకు సాంపిల్స్ సేకరించారు. అనంతరం అందరూ ప్రతిజ్ఞ చేసారు. ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీను, సి హెచ్ ఓ వినోళ్య, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశాలు విజయ లక్ష్మి, ఈశ్వరి, సుశీల, అరుణ, నరసింహ లు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo