సివిల్ సర్వీస్ లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థుల కృషి చేయాలి: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె)లో ప్రారంభమైన దీక్షారంబ్ రెండు వారాల ఇండక్షన్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం విద్యార్థులకి ఈనెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనుంది.మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకి ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి. వి. లక్ష్మీనారాయణ, ఐపిఎస్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చియున్నారు.లేటెస్ట్ టెక్నాలజీలపై పోకస్ చేయాలని, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీకి తగినట్లుగా ఉద్యోగ అవకాశాల కోసం మరియు సివిల్ సర్వీసెస్ సాధించడానికి ఇప్పటి నుంచే మంచి ప్రణాళికలు వేసుకుని కృషి చేయాలని సూచించారు.యువత స్మార్ట్ ఫోన్, చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా లైబ్రరీ, క్రీడా వసతులను వినియోగించుకుని భవిష్యత్తులో యూనివర్శిటీకి మరియు భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె. ప్రసాద్ , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.మోహన్ రావు , వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ జివిఎస్ఆర్. దీక్షితులు , ప్రొఫెసర్ ఎం.స్వరూపారాణి , కో-ఆర్డినేటర్లు డాక్టర్ వి. జయప్రసాద్ , డాక్టర్ జి. శ్యామ్కుమార్ , డాక్టర్ ఎస్. సత్యవేణి పాల్గొన్నారు.