14 October 2025
Tuesday, October 14, 2025

సెప్టెంబర్ 15న చలో విజయవాడ ను జయప్రదం చేయండి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దు చేయాలి

 

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని సెప్టెంబర్ 15న చలో విజయవాడ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం కొవ్వూరు స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుకూరి దొరయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దుచేసి నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయకుండా నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 35 లక్షల నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కాపాడడంలో ఆపదలో ఆదుకోవడంలో నిర్మాణ కార్మికుల సంక్షేమచట్టాన్ని అమలు చేసి వారి నిధుల్ని వారికి చట్టబద్ధంగా అందించడంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందన్నారు గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా చనిపోయిన వికలాంగులైన హాస్పటల్ పాలైన వారందరికీ పథకాలు అందించాలని బోర్డును పున ప్రారంభించాలని జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి రామకృష్ణ మాణిక్ రెడ్డి హరిబాబు జొన్నల రాంబాబు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo