WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకి ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకి ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని టిడిపి నాయకులు అన్నారు. మండలం వెంటూరు గ్రామంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మహిళలు మరియు తెలుగుదేశంపార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారెంటి కార్యక్రమంలో భాగంగా “మహాశక్తి” కార్యక్రమ కరపత్రాలను అందజేసినారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకి ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయలు, యువగళం ద్వారా ప్రతి నిరుద్యోగికి 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంటి ఇంటికి సురక్షిత మంచినీటి పథకం తదితర పథకాల గురించి ఇంటిఇంటికి తెలుగుదేశం పార్టీ మహిళలు, నాయకులు తిరుగుతూ ప్రజలకు వివరించారు. గడచిన నాలుగేళ్లుగా ప్రజల కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మహిళా సాధికారక కమిటీసభ్యులు వలీజాని, వీరలక్ష్మి, నక్కిరెడ్డి కనకవల్లి, పితాని వరలక్ష్మి, మేడిశెట్టి వరలక్ష్మి, అమజాల లక్ష్మి శ్రీను, రిమ్మలపూడి వేణుగోపాల్ దొర, కాదా ప్రభాకర రావు, దేవళ్ళ వెంకటరావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, మేడపాటి రవీంద్రారెడ్డి, రిమ్మలపూడి సత్యనారాయణ కోడి చిన్నఅప్పరావు, చిరట్ల అప్పారావు, వల్లూరి వెంకటరావు, పోతుల వీర్రాజు, వల్లూరి వెంకటరావు (పెద్దబ్బు), దేవు శ్రీను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement