విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో వెలమ కళ్యాణ మండపం వద్ద గురువారం విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఫ్రేషర్స్ డే కార్యక్రం నిర్వహించారు. ఈ కార్యక్రామానికి ముఖ్యాదితులుగా ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదికవి నన్నయ యూనివర్సటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం విద్యన భ్యసించాలన్నారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని , లక్ష్య సాధన కు నిరంతర కృషి చేయాలని సూచించారు. చాణక్య నర్సింగ్ హోం అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ తో కూడిన విద్య ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుందని పేర్కొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థలు అకాడమిక్ అడ్వైసర్ డాక్టర్. మల్లిడి అమ్మి రెడ్డి మాట్లాడుతూ అత్యుత్తమ అధ్యాపక బృందం, పటిష్ఠమైన విద్యా ప్రణాళిక ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఫీసులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాలలో కార్పొరేట్ విద్యను అందిస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, బైపిసి విభాగం లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి మనోజను అభినందించారు. హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ సభ్యులు పులగం నాగి రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. ఈ సమావేశంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, విఎస్ ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం సతీష్ రెడ్డి, డైరెక్టర్ ఎం శేష వేణి, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్. అచ్చి రెడ్డి, డైరెక్టర్స్ టి. అమ్మి రెడ్డి, టి .పార్వతి, కే . తాతా రెడ్డి, కే . భువనేశ్వరి, హెల్పింగ్ హాండ్స్ పి. నాగి రెడ్డి దంపతులు, టి. సుబ్బిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.