Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రామలింగేశ్వరునికి లక్ష బిల్వార్చన..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వార్కి లక్ష బిల్వార్చన ఘనంగా నిర్వహించారు. మండలంలోని లొల్ల గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామికి గురువారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ప్రతి ఏట కార్తీకమాసంలోఆలయ వంశపారంపర్య ధర్మకర్త పులగుర్త సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఈ లక్ష బిల్వార్చన నిర్వహించారు. కాగా అర్చకులు యలమంచిలి విశ్వనాథం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ యలమంచిలి సత్యనారాయణ శర్మ శివాచార్య పర్యవేక్షణలో వేద పండితులు సూర్య నమస్కార లింగార్చన, హోమం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్షబిల్వార్చన చేశారు. పార్వతీ దేవికి లక్ష కుంకుమార్చన, నీరాజనమంత్రపుష్పాం, దర్బారు సేవ, మహాదాశీర్వచనం నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమార్చన చేయించారు. సాయంత్రం జ్యోతిర్లింగార్చన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుండపునీడి వీర్రాజు ,పాతూరి రాంబాబు, ఆలయ సిబ్బంది డి . వీర వెంకట సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement