అక్రమ బియ్యాని తరలిస్తున్న డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు…
రాయవరం ఎస్సై జి నరేష్..
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండలం మాచవరం గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం పట్టుకున్నట్టు ఎస్ఐ జి.నరేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం రాయవరం పరిసర ప్రాంతాల్లో కార్డుదారుల నుండి కొనుగోలు చేసి మోటార్ సైకిల్ లిస్టు నుండి 15 రూపాయలు కొనుగోలు చేసి తిరిగి అదే బియ్యాన్ని 19 రూపాయలకు అనపర్తి, బిక్కవోలు పరిసర ప్రాంతాలలోని ఇటుకుల బట్టి కార్మికులకు విక్రయిస్తున్నారన్నారు. బియ్యం కు సంబంధించిన ఎటువంటి బిల్లులు లేనందున పోలీసులు సుమారు 57 వేల రూపాయల విలువ గల 3 టన్నులు పిడిఎస్ బియ్యాన్ని బొలెరో వాహనంలో మాచవరం నుంచి బిక్కవోలు తరలిస్తుండగా రాయవరంలో బస్సు స్టాండ్ వద్ద ఓ అజ్ఞాత వ్యక్తీ 112 పోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు వాహన తనిఖిలో పట్టుకున్నామన్నారు. డ్రైవర్ షేక్ బషీరను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.