Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 2:11 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 2:11 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 2:11 AM
Follow Us

రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

చెత్తను రోడ్లపై వెయ్యోదు
ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

చెత్తను రోడ్లపై వేయొద్దని నగరపాలక సంస్థ కమిషనర్ సి హెచ్ నాగ నరసింహారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన జగన్నాధపురం 26 వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజు పేట ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 26బి సచివాలయం పరిధిలో చెత్తను తరలించే వాహనాలు సక్రమంగా రావడం లేదని కార్పొరేటర్ నందం తో పాటు స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొన్ని వాహనాలు మరమ్మతులకు గురికావడం వల్ల సమస్య ఏర్పడిందని, ప్రత్యామ్నాయ వాహనాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎం హెచ్ వో డాక్టర్ పృధ్విచరణ్ కు సూచించారు. గతంలో కొనుగోలు చేసిన ఏడు అదనపు వాహనాలు కూడా ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే వాటిని వినియోగంలోకి తేవాలని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు,చెత్తను తరలించే వాహనాలు ఇళ్లకు వస్తున్నా కొన్ని చోట్ల మాత్రం ప్రజలు చెత్తను రోడ్లపైనే వేస్తున్నారని, ఇకపై అలా చేయవద్దని కోరారు. రోడ్లపై వేయడం వల్ల దోమలు పెరగడం, పందుల సమస్యతోపాటు ప్రజారోగ్యానికి భంగం కలిగేలా అనేక ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు సహకరిస్తున్నప్పటికీ అక్కడక్కడ చెత్తను రోడ్లపై వేస్తున్నారన్నారు. ప్రజల సహకారంతోనే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమని, స్వచ్ఛ సర్వేక్షన్ లో మంచి ర్యాంకు సాధించగలమని కమిషనర్ చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement