Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on April 1, 2023 1:15 AM

ACTIVE

India
15,208
Total active cases
Updated on April 1, 2023 1:15 AM

DEATHS

India
530,867
Total deaths
Updated on April 1, 2023 1:15 AM

బిజెపి బూత్ కమిటీల సభను విజయవంతం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి, ఇ జోనల్ ఇంచార్జ్
శివనారాయణ.
ఆలమూరు: సమావేశంలో పాల్గొన్న బిజెపి నాయకులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):

జూన్ 7వ తేదిన రాజమండ్రిలో జరుగు బిజేపీ బూత్ కమిటీల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇంచార్జి బిట్రా వెంకట శివన్నారాయణ, బిజెపి రాష్ట్ర స్వచ్చ భారతి కన్వీనర్ పాలూరి సత్యనందం అన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల బిజెపి మండల అధ్యక్షుడు నాగిరెడ్డి స్వామి ఇంట్టి వద్ద స్వచ్చ భారతి కన్వీనర్ పాలూరి సత్యనందం అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జూన్ 6వ తేదీన విజయవాడలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డాతో శక్తి కేంద్రం అధ్యక్షులతో పత్యక్ష సమీక్ష అనంతరం జూన్ 7వ తేదిన బూత్ కమిటీలతో రాజమండ్రిలో సభ జరుగు తుందని, ఈ సభకు రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలు వివిధ మోర్చాలు, సెల్స్ కన్వీనర్, కో కన్వీనర్లు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒబీసీ కార్యవర్గ సభ్యులు అయినవిల్లి సత్తిబాబు గౌడ్, జిల్లా కోసాధికారి రమేష్ వర్మ, టీచ్చర్ సెల్ కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయుణ, లీగల్ సెల్ కన్వీనర్ అల్ల భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డి దొరయ్య, జిల్లా కిసాన్ మోర్చ ఉపఅధ్యక్షులు ఎమ్ వి కృష్ణారెడ్డి, ఆలమూరు మండల అధ్యక్షులు నాగిరెడ్డి స్వామి, రావులపాలెం మండల అధ్యక్షులు కె వెంకట క్రిష్టా రెడ్డి, ఆత్రేయపురం మండల అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, వెంకటేశ్వర రావు, తొరాటి ఆజనేయులు అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!