Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం పట్టణం (విశ్వం వాయిస్)

శాంతి నగర్ రెండు కాలువల మొగలో వెలసిన ముత్యాలమ్మ అమ్మవారి ద్వైవార్షిక ఆలయ జాతర మహోత్సవం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహి0చుటకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణం జరిగిన యేడాది కరోనా మహమ్మారి వలన ఎటువంటి ఉత్సవాలు నిర్వహి0చలేదని నిర్వాహకులు కేతా నాగేశ్వరరావు తెలిపారు.ఈ రోజు గురువారం రాత్రిఅమ్మవారి జాతర జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతర ఉత్సవం లో గారడీలు, తీన్మార్, కోలాటం, వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.27 వ, తేదీ శుక్రవారం ఆలయం వద్ద తీర్థం, అలాగే 28వతేదీ శనివారం భారీ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ నిర్మాణ కర్త కేతా నాగేశ్వర రావు తెలియచేశారు. శాంతి నగర్ వంతెన వద్ద నుండి ఆలయం వరకు కాలువ గట్టు పొడవునా, ఆలయం వద్ద దీపాలు తో అలంకరించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు కేతా నాగేశ్వరరావు, అతని తనయుడు కేతా శ్రీనివాస్, కోడలు అయిన 11 వ, వార్డు కౌన్సిలర్ కేతా సుజాత లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement