విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):
పాము కాటుకు ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన రైతు మాజీ వార్డు మెంబరు, యెరుబండి సూరిబాబు(56) మృతిచెందారు. రోజు మాదిరిగానే శుక్రవారం పొలం వెళ్లి పనులు చేస్తుండగా పాము కరిచింది. చుట్టుపక్కల రైతులు గమనించి ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అందరి వాడిగా ఉండే సూరిబాబు రాజకీయంగాను చురుకైన పాత్ర పోషిస్తుంటారు. రాజకీయ నాయకుల అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. బడుగువానిలంక గ్రామంలోని సమస్యలను,రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, మీడియా దృష్టికి తీసుకెళ్లడంలో సూరిబాబు ముందుండేవారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు .సూరిబాబు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు