Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on April 1, 2023 12:15 AM

ACTIVE

India
15,208
Total active cases
Updated on April 1, 2023 12:15 AM

DEATHS

India
530,867
Total deaths
Updated on April 1, 2023 12:15 AM

జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు వాలంటీర్లను సన్మానించిన జనసేన నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఈ గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలిచిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినిడి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు వాసంశెట్టి కుమార్, మద్దా చంటిబాబు తెలిపారు. ఈ మేరకు పి.గన్నవరం మండలం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు ను విజయవంతంగా పూర్తిచేసిన వాలంటీర్లను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి, పార్టీ అధిష్టానం అందించిన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సాధనాల జెడి, జేఎస్ఆర్, అయినవిల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు అడపా రాంబాబు, ఎంపీటీసీలు పప్పుల సాయిబాబు, ఆదిమూలం సూర్యనారాయణ, షేక్ దొరబాబు, సర్పంచ్ పసలపూడి రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు అడ్డగళ్ళ శిరీ సతీష్, తాటికాయల శ్రీనివాస్, తాటికాయల వెంకటేష్, యడ్లపల్లి రాము, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!