విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
జగనన్న సురక్ష కార్యక్రమo
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఈ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయం నుండి ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే వారిని జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే నేరుగా వచ్చి ఏ ధ్రువీకరణ పత్రమైన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల నాయకులు సునీత గంగాధర్ కార్యకర్తలు పాల్గొన్నారు.