మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర తాళ్ళరేవు మండలం నుండి ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర తాళ్ళరేవు మండలం నుంచి ప్రారంభమై యానం మీదుగా ముమ్మిడివరంకు కొనసాగింది. ఇందులో భాగంగా బస్సు యాత్రలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, తాళ్ళరేవు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు. బస్సు యాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి, జిఎంసి బాలయోగికి పూలమాలలు వేసి, దాట్ల బుచ్చిబాబు నివాళులర్పించారు. అధిక సంఖ్యలో అభిమానులు ట్రాక్టర్లతో బైకులతో పాల్గొన్నారు. మండల పరిధిలోని పోలేకుర్రు మల్లవరం గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర ప్రజలలో మార్పు తీసుకురావడానికి అని ప్రజలందరూ ఆలోచించి సరైన నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు ఎస్సీ సెల్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ,ఊడా వెంకట రామకృష్ణ, రేవు గోవరాజు, దున్నా మహేంద్ర బాబు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.