తాళ్లరేవులో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర రావు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవులో టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పలువురిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక దోపిడి ఎక్కువగా జరుగుతుందనిజరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మనుషులు ఇసుక కొనలేని పరిస్థితిని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేసామని గుర్తు చేశారు, ఇప్పుడైతే జగన్ ఇసుకతో వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. మద్యపాన నిషేధం పేరుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక కొరత ఎక్కువగా ఉందని సామాన్య మానవుడు సైతం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క ట్రాక్టర్ ఇసుక వేళల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో గృహ అవసరాల కోసం సామాన్య ప్రజలు ఇసుకను ఎలా సమకూర్చుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.