విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు తగ్గినా,ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2.63 శాతం వృద్ధి చెందడం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమర్ధవంతమైన పాలనకు నిదర్శనం..జగన్ మోహన్ రెడ్డి 2019లో ముఖ్య మంత్రిగా పాలన చేపట్టేసరికి 98 లక్షల కోట్లుగా ఉన్నవాణిజ్య ఎగుమతులు, వారి 5 సంవత్సరాల పాలనలో 1కోటి 63 లక్షల కోట్లకు పెరిగి,ఏకంగా 65 శాతం వృద్ధికి చేరడం అద్భుతమైన అభివృద్ధిగా పరిగణించాలి.గత 5 సంవత్సరాల క్రితం వాణిజ్య ఎగుమతుల్లో 9వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం, 2019 నుండి 2024 ఆర్థిక సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి పాలనలో 6వ స్థానానికి వచ్చింది. రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో, ప్రజా తీర్పుతో మళ్ళీ వైసిపి ప్రభుత్వం రావడం, జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం జరిగి,వాణిజ్య ఎగుమతుల్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామి అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు అని డాక్టర్ పద్మలత అనుసూరి ఒక ప్రకటనలో తెలిపారు.