WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

హిడెన్ కెమెరాలు అమర్చిన దోషులను కఠినంగా శిక్షించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

హిడెన్ కెమెరాలు అమర్చిన దోషులను కఠినంగా శిక్షించాలి

 

పీడీఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్దు

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు బయటపడ్డాయి.సదరు కాలేజీలో చదువుతున్న విద్యార్థులే సీనియర్స్ కొంతమంది సహాయంతో గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో కెమెరాలను అమర్చినట్టు విషయం వెలుగులోనికి వచ్చింది. ఈవిషయం యాజమాన్యానికి వారం రోజుల క్రితమే విద్యార్థునులు తెలియజేసినప్పటికీ యాజమాన్యం ఈ సంఘటన పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ పోలీస్ కంప్లైంట్ కానీ సదరు వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనేది ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.దీనిలో కేవలం సీనియర్ విద్యార్థుల ప్రమేయమే ఉందా లేదా యాజమాన్యం,అక్కడ పనిచేసే వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందా అనే విషయానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలి.

ఈసంఘటన పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విధంగాను, అత్యంత పతనమైన దిగుజారుడు సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా ఉంది.ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.కాబట్టి ప్రభుత్వం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని,స్త్రీ లను ఆటవస్తువుగా చూసే వాతావరణం ఏర్పాడడానికి కారణమవుతున్న పోర్నోగ్రఫీ,డ్రగ్స్, ఆల్కహాల్ ను పూర్తిస్థాయిలో బ్యాన్ చేయాలని,సెన్సార్ బోర్డు ఆధారంగా స్త్రీ ను సినిమాలలోను, సీరియస్స్ లోను అసభ్యంగా చూపించే చర్యలకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని, విద్యార్థులకు భద్రతను కల్పించాలని,పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తుంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement