సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్
గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పడాల అనంత సత్య ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదాంతం అందరికీ తెలిసిందే. ఈ హత్యపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తిరిగి పూర్తి వివరాలను అందించాలని తీర్పు ఆదేశించడం పట్ల టీడీపీ నేత సరిపెల్ల రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజేష్ విలేకరులతో సమావేశం నిర్వహించి వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య ఉదంతంపై సిట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు చేయడం, లేకపోతే వారే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం వైసిపి వారికి పరిపాటిగా మారిందన్నారు. దళితులపై జరిగిన దాడులలో డాక్టర్ సుధాకర్, వీధి సుబ్రహ్మణ్యం, ఒక రిపోర్టర్కు శిరోమండనం చేయించడం ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. సుబ్రహ్మణ్యం హత్య చేసిన విధానంపై సిట్ వేసి అసలు హత్య వెనక ఎవరెవరున్నారు. ఏం జరిగింది అనేదానిపై కూటమి తీసుకున్న నిర్ణయాన్ని దళితులు తరుపున తాను స్వాగతిస్తున్నానని మహాసేన రాజేష్ మీడియాకు తెలియజేశారు. ఈ హత్యపై మొదటి నుంచి నిస్పక్షపాతంగా పోరాడుతున్న ముప్పాళ్ళ సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పలివెల రవి అనంత కుమార్, కొల్లాబత్తుల అప్పారావు, బండి సత్యనారాయణ ప్రజలు పాల్గొన్నారు.