నీలపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు లో భాగంగా డోర్ టు డోర్ సర్వే కార్యక్రమం మాజీ మంత్రి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, అందరివాడు దానికి తగిన డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి చిక్కాల రామచంద్ర రావు , క్లస్టర్ ఇంచార్జ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడిలక్ష్మణరావు , నీలపల్లి గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికి మూర్తి , గ్రామ కమిటీ అధ్యక్షులు, వస్కా రెడ్డి, దంగేటిసూరిబాబు ఎంపీటీసీ, కో క్లస్టర్ కడలి శ్రీనివాస్, గంట గోపి, కొల్లాటి వీరబాబు, కోలాకొండ, సుబ్బరాజు , జార్జి పేట గ్రామ కమిటీ అధ్యక్షులు కోనపరెడ్డి బుజ్జి , దండు శ్రీనివాస్ రాజు , బొడ్డు శ్రీనివాస్ ( చిన్ని), తదితరులు పాల్గొన్నారు.