రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కాకినాడసిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని చీడీలపొర మరియు పోర్టు పరిసర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను, గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించి రెవెన్యూ మరియు రిజిస్టర్ కార్యాలయాల నందు తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్లు చేయించిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ శాసనసభ్యులు వనమాడి కొండబాబు సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చీడీలపొర మరియు...