ఇద్దరు బాలికల ఆచూకీనితెలుసుకున్న పోలీసులు
సిబ్బందిని అభినందించిన సిఐ
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్
ఎస్ అచ్యుతాపురం నివాసి తంగేళ్ల సూర్య నాగమ్మ (భర్త నరసయ్య, 33 సం.) తమ కుమార్తె సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన తర్వాత కనిపించకుండా, రామారావుపేట లోని సంజీవ్ జూనియర్ కాలేజ్ నుండి వెళ్లిపోయిన తంగెళ్ల లావణ్య మైనర్ కుమార్తె తో వెళ్లి పోయినదని తెలిసి రాత్రి పొద్దుపోయిన తర్వాత అందిన ఫిర్యాదుతో,ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, కాకినాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు పాటిల్ దేవరాజ్ మనీష్ ఆదేశాల మేరకు కాకినాడ రురల్ ఇన్స్పెక్టర్ డీఎస్. చైతన్య కృష్ణ సూచనల మేరకు,...