గంగనాపల్లిలో వారాహి అమ్మవారి పూజలు
కాకినాడ రూరల్
వారాహి అమ్మవారి ఆలయంలో సామూహిక సరస్వతీ పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలోని వారాహి నగర్ లో వేంచేసియున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో సుమారు మూడు వందల మంది బాలబాలికలచే సరస్వతీ పూజలు నిర్వహించారు.అనంతరం కాకినాడ బృందం వారిచే కోలాటం ప్రదర్శన నిర్వహించారు.ఈసందర్భంగా దుప్పలపూడి జ్యోతి, సత్యనారాయణ మాట్లాడుతూ వారాహి అమ్మవారు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులకు దర్శనమిస్తున్నారని,ఆలయ అర్చకులు సాయి కిరణ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ అభిషేకం,కుంకుమార్చనలు,హొయలు, సరస్వతీ పూజలు జరుగుతాయని తెలిపారు.నవరాత్రులలో భాగంగా 9వ రోజు శుక్రవారం శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.