విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట గ్రామానికి చెందిన డేవిడ్ రాజు (వయసు: 44 సంవత్సరాలు) అనే వ్యక్తి అనుకోని సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, గత ఆరు సంవత్సరాలుగా జగ్గంపేట పంచాయతీలో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న డేవిడ్ రాజు, తేదీ 29.07.2025 (మంగళవారం) సాయంత్రం పంచాయతీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.
అయితే, తేది 30.07.2025 (బుధవారం) మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో జగ్గంపేటలోని మంచినీటి చెరువులో ఆయన మృతదేహం కనిపించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు డేవిడ్ రాజు తల్లి ఎల్లె రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు...
గండేపల్లి లో వాహనం సీజ్ ..ఇద్దరి వ్యక్తులు అరెస్ట్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి గండేపల్లి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల భాగంగా తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని అడ్డగించారు. వాహనాన్ని పరిశీలించగా, అందులో నాలుగు ఆవు దూడలు, 12 ఎద్దు దూడలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయబడిందని జగ్గంపేట సర్కిల్...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ మిస్సింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటువంటి ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ చేసి బాధితులను సురక్షితంగా గుర్తించి, బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు నిర్దేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల వివాహిత భర్త వద్దకు వెళ్లడానికి నిరాకరించి, కుటుంబ సభ్యులకు తెలియకుండా మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో సి అర్ నెంబర్ 114/2025 యూ /స్ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు అయింది.ఈ కేసును అధిక ప్రాధాన్యతతో తీసుకున్న గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు మరియు ఆయన పోలీసు...