హైదరాబాదులో గుర్తించిన గండేపల్లి పోలీసులు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఉమెన్ మరియు గర్ల్స్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో, గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామానికి చెందిన ఒక వివాహిత మహిళ అనామిక ఈ నెల 18వ తేదీన ఇంటి నుండి కనిపించకుండా పోయిన ఘటనపై గండేపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.ఎస్పీ ఆదేశాల మేరకు గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటుచేయబడింది. తగిన ఇంటిలిజెన్స్ సేకరణ, సాంకేతిక సహాయంతో అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరకు అనామికను...
9 మందికి రూ.90 వేలు జరిమానా
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కిర్లంపూడి పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, త్రాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈరోజు సంబంధిత తొమ్మిది మందిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం గౌరవ న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.90,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ త్రాగి వాహనం నడిపితే ప్రాణహాని సంభవిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత...
ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐ.పి.ఎస్ )జిల్లా వ్యాప్తంగా జూదక్రీడలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. కు అందిన విశ్వసనీయ సమాచారంతో, ఎస్ఐ శ్రఘునందన్ రావు మరియు సిబ్బందితో కలిసి కాట్రావులపల్లి గ్రామ శివారులో గరువు చెరువు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 5,150/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.అదే విధంగా, జగ్గంపేట శివారులోని స్మశానవాటిక వద్ద, చట్టానికి విరుద్ధంగా మద్యం దాచిన వ్యక్తిపై చర్యలు...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లాలో ఎటువంటి జూదక్రీడలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్లో పోలీస్ విభాగం విజిలెంట్గా వ్యవహరిస్తోంది.ఆదేశాల ప్రకారం ఆదివారం జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగం గా జగ్గంపేట బాలాజీ నగర్ ,టౌన్ హాల్ , కాకినాడ రోడ్ లో ఉన్న జగ్గంపేట ఎస్సార్ పెట్రోల్ బంక్ ,రాజపూడి రైస్ మిల్ వెనుక ఉన్న పామ్ ఆయిల్ తోట లో కీలక ప్రాంతాల్లో నిఘా పెంచి, స్థానిక...
ముగ్గురు అరెస్ట్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ జిల్లాలో కమర్షియల్ సెక్స్ వర్క్పై పూర్తిస్థాయి కట్టడి విధించాలని, ఎక్కడా ఏ రూపంలోనూ ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ ఆదేశాల నేపథ్యంలో జగ్గంపేట శ్రీరామ్నగర్ ప్రాంతంలోని ఓ నివాస గృహంలో గుట్టుచప్పుడు కాకుండా కమర్షియల్ సెక్స్ వర్క్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్ఐ రఘునందన్ రావు, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడిలో ఒక మహిళతో పాటు బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలు జి. కాంతమ్మ (గుంటూరు జిల్లా) మరియు ఇద్దరు విటులు అక్కడ పట్టుబడ్డారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, బ్రోతల్...
జగ్గంపేట సర్కిల్ పరిధిలో 11 మందిపై బౌండ్ ఓవర్ కేసులు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని సర్కిళ్ల పోలీసులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ నేపథ్యంలో, జగ్గంపేట సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మీద బౌండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడ్డాయి.జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె. ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల్లో భాగంగా, గండేపల్లి గ్రామంలో తరచూ గొడవలకు పాల్పడుతున్న ప్రక్కప్రక్క వాసులైన 6 మందిపై బౌండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఎర్రంపాలెంకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అనుమానంతో వేధించడాన్ని గుర్తించిన పోలీసులు...
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కఠిన చర్యలు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశించిన నేపథ్యంలో కిర్లంపూడి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.ఇందులో భాగంగా, ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గౌరవ పత్తిపాడు కోర్టు ముందు హాజరుపరిచారు.కోర్టు విచారణలో ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా ఐదుగురికి రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తూ మొత్తం రూ. 50,000 జరిమానా విధించింది.ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన తనిఖీల్లో పోలీసులు మూగ జీవాల అక్రమ రవాణాను బయటపెట్టారు. గుమ్మిడికాయల లోడ్లో నిక్కచ్చిగా దాచిన రెండు ఆవులు, ఎనిమిది గిత్తలతో కూడిన మినీ వాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జగ్గంపేట సీఐ వై.ఆర్.కే. శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. వాహనాన్ని నిలిపివేసి లోతుగా పరిశీలించగా, గుమ్మిడికాయల మూటల క్రింద పశువులను దాచినట్లు గుర్తించారు.వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకొని వాహనంతో పాటు కిర్లంపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు...
జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లపై నిఘాను పెంచడమేకాక, వారి పునరవాసానికి పోలీసు విభాగం నడుం కట్టింది. ఈ నేపథ్యంలో జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె. మరియు కిర్లంపూడి ఎస్ఐ ఎస్ ఐ గోలి సతీష్ పాల్గొన్నారు. జగ్గంపేట సిఐ వై ఆర్ కె మాట్లాడుతూ రౌడీషీటర్లు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం తీసుకుని ఇకపై సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఎవ్వరైనా మళ్లీ ఏవైనా గొడవలు, దౌర్జన్య ఘటనలు,...
అరెస్టయిన దుర్గ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన డ్వాక్రా అసిస్టెంట్ (వి.ఓ.ఏ) దుర్గ అనే మహిళ స్త్రీ నిధి లోన్ల పేరుతో డ్వాక్రా సభ్యుల నుండి దాదాపు రూ. 20.25 లక్షలు మోసపూరితంగా కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెను కిర్లంపూడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సూక్ష్మంగా పరిశీలిస్తే, 2022 నుంచి డ్వాక్రా మేటర్-1 గా పనిచేస్తున్న దుర్గ, బూరుగుపూడి గ్రామ పరిధిలోని 42 డ్వాక్రా గ్రూపులకు ఇన్చార్జిగా పని చేస్తున్నారు. 2023లో స్త్రీ నిధి ద్వారా 12 గ్రూపులకు లోన్ను ఇప్పించారు. అయితే, వాటిలో 8 గ్రూపుల సభ్యుల ఖాతాల్లోకి వచ్చిన డబ్బులను మళ్లీ తీసేందుకు, వారి సంతకాలు/వేలిముద్రలు తీసుకొని నమ్మకద్రోహంగా సుమారు రూ. 20.25 లక్షలు దుర్వినియోగం చేశారు.ఈ వ్యవహారంపై, దేవి శక్తి డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీమతి కె. వీరలక్ష్మి గారు మే 24, 2025న కిర్లంపూడి...