మాట నిలబెట్టుకున్న మంత్రి సుభాష్
గొల్లపాలెం కుయ్యేరు నిర్మాణ పనులు ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న కాజులూరు మండల ప్రజలు
విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు మండలం
రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంట్రాక్టర్ కి పాత బిల్లులు పడని కారణంగా కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ రోడ్డున వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు వారం రోజుల క్రితం అయితపూడి గ్రామ పర్యటనలో ఉన్న మంత్రి సుభాష్ దృష్టకి కూటమి నాయకులు సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సుభాష్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ లతో మాట్లాడి వెంటనే రోడ్డు...