విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
విజయవాడ హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్ను మళ్లీ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాయగా, దానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా విజయవాడను తిరిగి హజ్ ఎంబార్కేషన్ పాయింట్గా గుర్తిస్తూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండపేట టీడీపీ ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై హజ్ యాత్రికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రం నుంచే యాత్ర ప్రారంభించవచ్చని తెలిపారు. ఇది ముస్లింలకు పెద్ద ఊరటగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ఈ...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
30వ వార్డు కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ వైసీపీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత కట్టబెట్టిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మండపేట వైసీపీ ఇన్ చార్జి, పార్టీ సలహాదారుల కమిటి మెంబర్, రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా, తోట త్రిమూర్తులు మండపేట నుండి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పాటు పడతానని ఆయన స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం...
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండల పరిధిలో గల వివిధ గ్రామాలకు చెందిన పలువురికి 156 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. నూతనముగా మంజూరైన పింఛనులు భర్త మరణిస్తే భార్య కు వచ్చినవే అన్నారు. వీరందరికీ ప్రతీ నెల ఫించన్లు అందించనున్నారని ఆగష్టు నెలకు సంబంధించిన ఫించన్లు 1 వ తేదీ శుక్రవారం రూ.4000 చొప్పున పంపిణీ చేపడతామన్నారు. దీనితో మండల వ్యాప్తంగా మొత్తం పింఛన్లు 10,036 కాగా ఈ ఫించన్లు నిమిత్తం రూ.4,28,66,500 లు విడుదలైనట్లు ఎంపీడీవో ప్రకటన ద్వారా తెలిపారు
సోమేశ్వరం హైస్కూల్లో "డ్రగ్స్ వద్దు బ్రో" కార్యక్రమం
మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, శక్తి యాప్ అంశాలపై అవగాహన
సోదరిగా భావించి మహిళా పోలీస్ తో సమస్యలు చెప్పండి
విద్యార్థులకు పలు సూచనలు చేసిన ఎస్సై సురేష్ బాబు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారతదేశ విలువైన ముఖ్య సంపద యువత అని, విద్యార్థి దశ నుండి ఉన్నత విలువలు కలిగి. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, దేశ ప్రగతిలో తమ వంతు పాత్ర ఉండేలా ఎదగాలని విద్యార్థులకు రాయవరం ఎస్సై సురేష్ బాబు సూచించారు. రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం "డ్రగ్స్ వద్దు బ్రో" కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మాదకద్రవ్యాల...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మండపేట మండలం,జెడ్ మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.అధ్యక్షులుగా సలాది బాలసుబ్రమణ్యం, సభ్యులుగా సంగిశెట్టి అమ్మన్న, బోయిడి వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ కూటమి నాయకులు, రైతులతో కలసి నూతన కమిటి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట...
కౌన్సిలర్ మందపల్లి రవి...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, మండపేట
మండపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7,8 వార్డులలో సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, గోతులతో నిండిపోయాయని,సిసి రోడ్లు డ్రైనేజీల్లో ఒరిగిపోయాయి అని వెంటనే వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను 8 వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవి కోరారు. మండపేట టౌన్ పరిధిలో 30 వార్డులకు సీసీ రోడ్ల రిపేరు పనుల నిమిత్తం 17 లక్షలు శాంక్షన్ అయ్యి మూడు నెలలు గడిచిన నేటి వరకు ఈ రోడ్డు రిపేర్ పనులకు మోక్షం కలగలేదని అన్నారు. ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ప్రజలు ప్రతిరోజు తమ సమస్యల నిమిత్తం చాలామంది ఈ రోడ్ గుండా వెళ్తారని...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చోడే శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.యువజన విభాగం ద్వారా చేస్తున్న కార్యక్రమాలు గూర్చి ఏపీ సబార్బినేట్ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించగా జగన్ ప్రత్యేకంగా అభినందించారని శ్రీకృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. యువజన విభాగం బలోపేతానికి కృషిచేయాలని సూచించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు.
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా మండపేట కు చెందిన ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) నియమితులయ్యారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ,మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ , రాష్ట్ర సబర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన ఈ బాధ్యతను 2029 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు...
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బీజేపీ సంస్థాగత నియామకాలలో భాగంగా మండపేట నియోజవర్గం రాయవరం మండలం, లొల్ల గ్రామంలో మండల భాజపా అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్ అధ్యక్షతన నూతనంగా జిల్లా పదవులు పొందిన నాయకులను బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కె వి వి సాయిరామ్ ఘనంగా సత్కరించారు. నూతన జిల్లా కమిటీకి ఉపాధక్షులుగా రాయవరం మండలం లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ను రెండవసారి నియమించగా, మరొక ఉపాధక్షులు గా వెదురుపాక కు చెందిన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీదేవి ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా పూర్వ మండల అధ్యక్షులు రాయి వీర్రాజు, తుమ్మలపల్లి సూర్యనారాయణ, నరాల రాంబాబు,...
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా...
జెఏసి సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
మండపేట ప్రజల ఆకాంక్ష మేరకు మండపేట ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తను ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మండపేట లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం జెఏసి చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట టౌన్, మండలం విలీనం చేసేందుకు ఇక్కడి ప్రజలు వంద శాతం సుముఖంగా...