కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం.
వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి.
నిమజ్జనం నిర్వహించే తేదీతో పాటు సమయాన్ని కూడా ముందుగా తెలియజేయాలి.
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
కొవ్వూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీస్ మరియు రెవెన్యూ ద్వారా తగిన అనుమతులను పొందవలెనని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తి...