ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం - ఆర్డీవో
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
“మీ కోసం” కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత సూచించారు. సోమవారం స్థానిక కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ - మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీవో రాణి సుస్మిత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, మొత్తం ఈరోజు 21 అర్జీలు పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. వారంలో రెండు రోజులు సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు....