పోలేకుర్రులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని సంకటరేవు జై భీమ్ పేట గ్రామాల్లో ఆదివారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సి ఎస్ ఆర్ నిధులతో 30 లక్షల రూపాయలతో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం జై భీమ్ పేట మండల ఎస్సీ సెల్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలోగ్రామంలో తల్లికి వందనం కృతజ్ఞత సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యేను స్థానిక నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించి ఇంటిలో ఉన్న...