అమలాపురం
: వైసీపీ అరాచక పాలన, కూటమి ప్రభుత్వ అభివృద్ధి- సంక్షేమ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరితే సజ్జల రామకృష్ణరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు సవాల్ పై స్పందించడానికి నువ్వేమైనా ఎమ్మెల్యేవా? ఎమ్మెల్సీవా అని సజ్జలను ప్రశ్నించారు. మంగళవారం నాడు అమలాపురంలో సతీష్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని సజ్జల పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు కానీ చంద్రబాబు కాదని, వైసీపీకి ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యంగా చూస్తున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలనకు ప్రజలు 11 సీట్లిచ్చారు.....