ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్ పిలుపు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్ పిలుపునిచ్చారు. కాకినాడలోని ఐడియాల కళాశాలలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉద్వేగపూరిత వాతావరణంలో నిర్వహించారు.
ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలతో కూడిన ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్లీనరీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పి. రామ్మోహన్,...