జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఘన స్వాగతం పలకాలి - ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
సారథ్యం అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలకాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గౌతమి నగర్ నందు 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ నివాసం వద్ద కొవ్వూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా తయారు...