01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

విద్య వాయిస్

తామరాడ జడ్పి హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ సెంటర్‌లో ప్రయోగాత్మక శిక్షణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావు పేటలోని ఏసిటి సైన్స్ సెంటర్‌లో, కిర్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని ఆమ్లాలు,క్షారాలు,లవణాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రయోగాలను సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్దా శ్రీనివాస్ ప్రాయోగికంగా నేర్పించారు. సహజ సూచికలను ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను గుర్తించడం, ఎర్ర,నీలి లిట్మస్ పేపర్‌లతో పరీక్షించడం, సింథటిక్ ఇండికేటర్ల సహాయంతో ఆమ్ల,క్షారాలను వర్గీకరించడం, వివిధ ద్రవాల పిహెచ్ విలువలను గుర్తించడం, ఆమ్లాలు,క్షారాల ద్వారా విద్యుత్ ప్రవాహం ఎలాజరుగుతుందో తెలుసుకోవడం వంటి ప్రయోగాలు విద్యార్థులు ప్రాక్టికల్‌గా చేసారు.ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రయోగపూర్వకంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల...

జగ్గంపేట భాష్యం స్కూల్లో ఘనంగా తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట రావులమ్మ నగర్ లోని గల భాష్యం పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు మరియు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో తెలుగు ఒకటన్నారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడుకునే భాష తెలుగు అని తెలియజేశారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు...

విజ్ఞాన వేదికపై తామరాడ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలోని ఏ.సీ.టి. సైన్స్ సెంటర్ వేదికగా కిర్లంపూడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తామరాడ పదవ తరగతి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.ఉదయం సెషన్‌లో రసాయన సమీకరణాలు, చర్యలకు సంబంధించిన ప్రయోగాలు విజయవంతంగా చేయగా మధ్యాహ్నం ఆమ్లాలు క్షారాలు లవణాలపై ప్రయోగాలు జరిపి శాస్త్రపరమైన అవగాహన పెంచుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థి నవీన్ పాములు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించారు.వర్క్‌షాప్‌లో ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయులు పరమేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందజేయడంలో మిషన్ అన్నపూర్ణ సహాయనిధి వ్యవస్థాపకుడు రాజేష్‌కుమార్ ప్రత్యేక సహకారం అందించారు.

జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు కొత్త ప్రిన్సిపాల్‌గా జీవి లలిత కుమారి బాధ్యతలు స్వీకరణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల నూతన ప్రిన్సిపాల్‌గా శనివారం జీవి లలిత కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె రాజమండ్రిలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా సేవలందించిన అనుభవం ఉంది.ఇప్పటివరకు ఈ పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రాజకుమారి చొల్లంగి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులను అభ్యున్నత మార్గంలో తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజూ పర్యవేక్షిస్తాను అని తెలిపారు.ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు పూల గుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. విద్య, శిక్షణల విషయంలో పాఠశాల మరింత ముందుకు సాగుతుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

జగ్గంపేట పేద విద్యార్థికి శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ విద్యా ప్రోత్సాహం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేటకు చెందిన పేద విద్యార్థి కణితి సోమ శేఖర్ ఇటీవల నిర్వహించిన ఎ యూ సెట్  పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించాడు. అతని ప్రతిభను గుర్తించి, శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.10,000/- ను విద్యా ప్రోత్సాహకంగా అందజేశారు.ఈ సహాయాన్ని తోట నరసింహం, తోట రాంజీ, ఒమ్మి రఘురాం,ట్రస్ట్ చైర్మన్ కరుటూరి శ్రీనివాస్ చేతుల మీదుగా సోమ శేఖర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “పేద విద్యార్థుల శిక్షణకు, విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ మా ట్రస్ట్ అండగా ఉంటుంది” అని తెలిపారు.

ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి

బూరుగుపూడి గ్రామంలో సామాజిక కార్యకర్త పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్య యాత్ర జగ్గంపేట నేటి బాలలే రేపటి పౌరులు అనే దృష్టితో గ్రామస్థాయిలో విద్యపై అవగాహన పెంపొందించేందుకు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రత్యేక చైతన్య యాత్ర చేపట్టారు. బూరుగుపూడి గ్రామంలోని పాఠశాల విడిచి ఉన్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్య ద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసం చేకూరుతుందని, మంచి పౌరులుగా ఎదగగలరని చెప్పారు.ప్రతి గ్రామంలోను బడికి వెళ్ళని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యపై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని, ఈ పని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo