- అచ్చాయమ్మా కాలనీ 4 వ వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
వినాయక చవితి వేడుకలలో ప్లాస్టో ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలోని అచ్చాయమ్మా కాలనీ నాలుగో వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని సాంప్రదాయమైన పండుగలను నిర్వహించుకోవడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. వినాయచవితి వేడుకలలో మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటుచేసిన శ్రీ...
కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం.
వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి.
నిమజ్జనం నిర్వహించే తేదీతో పాటు సమయాన్ని కూడా ముందుగా తెలియజేయాలి.
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
కొవ్వూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీస్ మరియు రెవెన్యూ ద్వారా తగిన అనుమతులను పొందవలెనని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తి...